*పాడేరు పాత బస్టాండ్ కూడలి వద్ద ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నిషాంతి
దివ్య దర్శిని న్యూస్,ఏ ఎస్ ఆర్ జిల్లా (పాడేరు), ఏప్రిల్ : 14,
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల దాహార్తీని తీర్చేందుకు పాడేరు పాత బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ కూడలి వద్ద పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్
నిషాంతి. టి ఈరోజు ఉదయం రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
ప్రజల సౌకర్యార్థం ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఈ చలివేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.ఈ చలివెంద్రాన్ని పంచాయతీ శాఖ అధికారులు నిర్వహిస్తారని, ఈ
నిర్వహణ వేసవి ముగిసే వరకు ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన, చల్లని తాగునీరు అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఎండల ప్రభావం రోజు రోజుకు ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అందుకు తగినన్ని నీళ్లు తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి ఆదిత్య వర్మ, మాజీ శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి, డిఎల్పిఓ పిఎస్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.