బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత : జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి

Bureau June 17, 2026 05:41 AM 1 views
ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత  : జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి

ఈవిఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత

*జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి

నెల్లిమ‌ర్ల‌,దివ్య దర్శిని న్యూస్;

 నెల్లిమర్ల ఈవిఎం గోదాముల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి మంగళవారం త్రైమాసిక త‌నిఖీ నిర్వహించారు. గోదాం ష‌ట్ట‌ర్ల‌కు వేసిన సీళ్ల‌ను, తాళాల‌ను తెరిపించి లోపలి గదులను, సీళ్లను ప‌రిశీలించారు. మొదటి అంతస్తులో ఉన్న గోదామును సైతం తనిఖీ చేశారు. పోలీసు బందోబ‌స్తుపై స‌మీక్షించారు. సిసి కెమేరాల ద్వారా చుట్టుపక్క‌ల‌ పరిస్థితులను ప‌రిశీలించారు. సిబ్బంది అంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను, పోలీసు సిబ్బందిని ఆదేశించారు.
 ఈ తనిఖీల్లో ఆర్డీవో ఎస్.సుధా సాగర్,   నెల్లిమ‌ర్ల‌ తహ‌సీల్దార్ శ్రీ‌కాంత్‌, క‌లెక్ట‌రేట్ ఎన్నిక‌ల‌ సూప‌రింటిండెంట్ ప్ర‌సాద‌రావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు టీడీపీ తరపున రాజారావు, వైకాపా నుంచి ఎస్.రామారావు, కాంగ్రెస్ నుంచి బీవీ రమణ, జనసేన నుంచి ఎ.రవికుమార్ ఇత‌ర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

21 Jul 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```