డుంబ్రిగుడ దివ్య దర్శిని న్యూస్)
గిరిజన బిడ్డలపై మానవత్వం చాటుకున్న అరకు సిఐ ఎల్ హిమగిరి:
ఆదివాసీ గిరిజన బిడ్డలపై సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ హిమగిరి. మండలంలోని లైగండ పంచాయతీ సింది పుట్టు గ్రామంలో స్థానిక ఎస్ఐ ఎల్ సురేష్ ఆధ్వర్యంలో అరకు సిఐ ఎల్ హిమగిరి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా సిందిపుట్టు గ్రామ గిరిజన ప్రజలతో సమావేశమై వారి యొక్క బాగోగులు అడిగి తెలుసుకుని గిరిజన యువతి యువకులకు వాలీబాల్ కిట్లు అందించారు. అలాగే అదే గ్రామానికి చెందిన కిల్లో రాంబాబు ఆర్థిక పరిస్థితి చూసి వారి పిల్లలకు అనకాపల్లిలో ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలలో జాయినింగ్ చేసి వారికి హాస్టల్ లో చేర్పించారు. అదేవిధంగా వారికి చదువుకోవడానికి పెన్నలు, ప్లాంక్స్ , బట్టలు కూడా ఇవ్వడం అందించి రాంబాబు వారి పెద్దబ్బాయి అర్జున్, పెద్దమ్మాయి మహేశ్వరి కళ్ళు (కంటి చూపు) అనారోగ్యంతో బాధపడతుండడం చూసి వారికి విశాఖపట్నం ఆసుపత్రి సంకర ఫౌండేషన్ లో స్వయంగా తీసుకొని వెళ్లి కళ్ళు (కళ్ళు చూపులు) ఆరోగ్యం బాగు చేయించారు. అంతే కాకుండా వారి ఆర్థిక పరిస్థితులు మరియు ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటు మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.