డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని లింగంపేట నూకాలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు
గొలుగొండ దివ్యదర్శిని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంగా శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసైనికులు గొలుగొండ మండలం లింగంపేట నూకాలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సూర్యచంద్ర మాట్లాడుతూ నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ ఉండే పవన్ కళ్యాణ్ నేడు అనారోగ్యం కారణంగా ఇబ్బంది పడటం పట్ల తెలుగు రాష్ట్రాల ప్రజలే గాక, యావత్తు దేశమంతటా అభిమానులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని ఇక్కడే కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పవన్ కళ్యాణికి జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైందని, అభిమానులు ఎవరూ ఆందోళనకు గురికావద్దని తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షకుడైన పవన్ కళ్యాణ్ ను ఆ ధర్మమే రక్షిస్తుందని సూర్యచంద్ర ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ మండల జనసేన అధ్యక్షులు గండెం దొరబాబు, చోద్యం పిఎసిఎస్ డైరెక్టర్, నర్సీపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సలాదుల ప్రసాద్ బాబు దేవి,సీనియర్ నాయకులు రేగుబళ్ల సాంబమూర్తి, గొలుగొండ ఎస్సీ సెల్ అధ్యక్షులు బోయిన చిరంజీవి, గొలుగొండ యూత్ అధ్యక్షులు వాసం వెంకటేష్ మరిసా స్వామి నాయుడు, ఎలిశెట్టి సాయి కుమార్, పరవాడ ప్రసాద్.తదితరులు పాల్గొన్నారు.