రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో యలమంచిలి క్రీడాకారులు ప్రతిభ
యలమంచిలి, న్యూస్
ఎలమంచిలి: రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో యలమంచిలి క్రీడాకారులు రెండు పతకాలు సాధించారని టైక్వాండో కోచ్ నగి రెడ్డి సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఈనెల 5వ తేదీ నుంచి ఏడో తేదీ వరకు విజయనగరంలోనే రాజీవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఐదవ ఏపీ కప్ రాష్ట్రస్థాయి ఓపెన్ టైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో సత్య టైక్వాండో స్పోర్ట్స్ అకాడమీ సీనియర్ క్రీడాకారులు ఒక స్వర్ణ పథకం, రజిత పథకాన్ని సాధించారని తెలిపారు. సీనియర్ మెన్ 80 కిలోల భాగంలో కొండల రవి బంగారు పతకం సాధించగా, 68 కిలోల భాగంలో సేనాపతి నాగేశ్వరరావుకు రజిత పథకం లభించింది అన్నారు. విజేతలను యలమంచిలి టైక్వాండో క్లబ్ అధ్యక్షులు కే జగదీష్ పాల్, అంతర్జాతీయ క్రీడాకారుడు కే. దొరబాబు, సంఘం సభ్యులు క్రీడాకారులు అభినందించారని తెలిపారు.