బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

వెంకమ్మ కృష్ణ సాగరం ​చెరువుకు పూర్వవైభవం

Bureau May 06, 2026 06:51 AM 3 views
వెంకమ్మ కృష్ణ సాగరం ​చెరువుకు పూర్వవైభవం

అనకాపల్లి డిడి న్యూస్ పత్రికా ప్రకటన

వెంకమ్మ కృష్ణ సాగరం ​చెరువుకు పూర్వవైభవం

జె.వి.పాలెం రైతన్నల సాగు కష్టాలకు శాశ్వత పరిష్కారం

జలధార - జలహారతి' కార్యక్రమంలో భాగంగా పనులు వేగవంతం

అనకాపల్లి, మే 05: అనకాపల్లి జిల్లా జిల్లా ఎస్.రాయవరం మండలంలోని జంగులూరు వెలంపాలెం గ్రామ రైతాంగానికి దశాబ్దాల కాలంగా కలగా మిగిలిన సాగునీటి కల సాకారం కాబోతోంది. చారిత్రాత్మకమైన వెంకమ్మ కృష్ణ సాగరం  చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టడం ద్వారా ఆ ప్రాంత వ్యవసాయ ముఖచిత్రం పూర్తిగా మారనుంది. ఒకప్పుడు జలకళతో అలలాడిన చెరువు, కాలక్రమేణా పూడికతో నిండిపోయి తన ఉనికిని కోల్పోయింది. సుమారు 145 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు గర్భం అంతా మట్టితో నిండిపోవడంతో, వర్షాలు కురిసినా నీటిని నిల్వ చేసే సామర్థ్యం లేక అటు సాగునీరు అందక, ఇటు భూగర్భ జలాలు పెరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా 145 ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ చెరువు కింద పంటలు పండించడం రైతులకు గగనంగా మారింది.

​ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జలధార - జలహారతి' కార్యక్రమం లో భాగంగా వెంకమ్మ కృష్ణ సాగరం చెరువుకు కొత్త జీవం పోస్తోంది. చెరువు గర్భంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను తొలగించడంతో పాటు, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. కేవలం పూడిక తీతకే పరిమితం కాకుండా, చెరువు గట్లను పటిష్టం చేయడం ద్వారా నీటి వృథాను అరికట్టాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఆయకట్టుకు నీరు చేరే ప్రధాన కాలువలను కూడా ఆధునీకరిస్తుండటంతో, చివరి ఎకరం వరకు సాగునీరు అందుతుందనే ధీమా రైతుల్లో వ్యక్తమవుతోంది. ఈ పునరుద్ధరణ పనుల వల్ల కేవలం 150 ఎకరాలకు సాగునీరు మాత్రమే కాకుండా, చుట్టుపక్కల బావులు మరియు బోర్లలో నీటి మట్టం గణనీయంగా పెరిగి తాగునీటి సమస్య కూడా పరిష్కారం కానుంది. ​ఈ మార్పు  జంగులూరు, వెలంపాలెం బాటలు వేయనుంది. దిగువ గ్రామాలు ఆర్థిక స్థిరత్వానికి బాటలు వేయనుంది. 150 ఎకరాల పంట భూమిలకు మరియు ఇప్పుడు రెండు పంటలకు సరిపడా నీరు అందే అవకాశం ఉండటంతో, దిగుబడి పెరిగి రైతు కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి. పూడిక మట్టిని రైతులు తమ పొలాలకు తరలించుకోవడం ద్వారా భూమి సారవంతం కావడం మరో విశేషం. వెరసి,  వెంకమ్మ కృష్ణ సాగరం చెరువు కేవలం ఒక నీటి వనరుగా మాత్రమే కాకుండా, వందలాది రైతు కుటుంబాల జీవనాధారంగా అవతరిస్తోంది. ఎస్ రాయవరం  మండలంలోని ఇతర గ్రామాలకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది ఈ పునరుద్ధరణ పనుల పట్ల గ్రామస్తులు మరియు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

05 Sep 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```