డి డి న్యూస్ బొబ్బిలి:
స్వీయ జనగణన నమోదు ప్రక్రియను ప్రారంభించిన ఎమ్మెల్యే బేబీనాయన
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన "స్వీయ జనగణన (Census Self-Enumeration)" కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం బొబ్బిలి కోటలో గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) గారు ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ, స్వీయ జనగణన ప్రక్రియకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, దీనిలో ప్రజలు తమ వివరాలను యాప్ లేదా పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.. అలాగే, ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన సమాచారాన్ని అందించి, ఈ జాతీయ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.