పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ
*పది రోజుల్లో ఎనిమిది పోన్లు రికవరీ
నెల్లిమర్ల, దివ్యదర్శిని న్యూస్;
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను వెతికి పట్టుకోవడంలో నెల్లిమర్ల పోలీసులు విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. గడిచిన 10 రోజుల్లోనే మొత్తం 8 సెల్ ఫోన్లను రికవరీ చేసి, వాటిని అసలైన యజమానులకు అప్పగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా టెక్నాలజీ సాయంతో ఈ ఫోన్లను ట్రాక్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఫోన్ పోగొట్టుకున్న వారు నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చు లేదా ఇంటి నుండే CEIR పోర్టల్లో వివరాలను నమోదు చేయవచ్చన్నారు. ఎవరైనా సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, తద్వారా మీ ఫోన్లను తిరిగి పొందే అవకాశం ఉంటుందని నెల్లిమర్ల ఎస్ఐ మండల ప్రజలకు సూచించారు.
ఫోన్ పోయిన వెంటనే దాని IMEI నంబర్ మరియు ఇతర వివరాలతో పోర్టల్లో రిజిస్టర్ చేయడం ద్వారా రికవరీ ప్రక్రియ సులభతరం అవుతుందని ఎస్ఐ వెల్లడించారు.