6,7 వార్డ్ ప్రజల దాహార్తిని తీర్చే దిశగా 'మైపాడ' ముందడుగు
* సొంత నిధులతో తాగునీటి సరఫరాకు చర్యలు
నెల్లిమర్ల, దివ్య దర్శిని , న్యూస్:
వేసవి కాలం వచ్చిందంటే చాలు సామాన్యులకు మంచినీటి కష్టాలు మొదలవుతాయి. ముఖ్యంగా నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధిలోని పలు వార్డుల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో, స్థానిక ప్రజల కష్టాలను చూసి చలించిన బిజెపి మండల అధ్యక్షులు మైపాడ ప్రసాద్, వారి దాహార్తిని తీర్చేందుకు తన ఉదారతను చాటుకున్నారు.
ప్రజా విన్నపానికి తక్షణ స్పందన
నగరపంచాయతీ పరిధిలోని 6, 7 వార్డుల మహిళలు తమ నీటి సమస్యను ప్రసాద్ దృష్టికి తీసుకురాగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా, తన సొంత నిధులతో శాశ్వత పరిష్కారం చూపేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆదివారం 6,7వ వార్డులోని పాత బోరును శుభ్రం చేయించారు.
6,7వ వార్డుల్లో పాత బోరును పునరుద్ధరించి, నూతన మోటారును బిగించి, ట్యాంక్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేయనున్నారు.
ఇప్పటికే 7వ వార్డులో రెండు చోట్ల బోరు బావులు తవ్వించి, ట్యాంకులు నిర్మించి ప్రజలకు తాగునీటిని అందిస్తున్నారు.
9వ వార్డు: ఒక చోట బోర్ వెల్ ఏర్పాటు చేసి నీటి సమస్యను తీర్చారు.
"ఎండలు మండిపోతున్న తరుణంలో ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తన వంతు సాయమందించినట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటున్న మైపాడ ప్రసాద్పై స్థానిక మహిళలు మరియు వార్డు వాసులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి సేవా దృక్పథం ఉన్న నాయకులు ఉంటే, సామాన్యుల సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని వారు అభిప్రాయపడుతున్నారు.